హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్యం తాగి బస్సు నడిపిన డ్రైవర్

CTR: విద్యార్థులతో వెళ్తున్న కాలేజీ బస్సును మద్యం సేవించి నడిపిన డ్రైవర్‌కు న్యాయస్థానం రూ.10 వేల జరిమానా విధించింది. యాదమరి మండలం ఓటేరుపల్లి వద్ద పోలీసులు బస్సును తనిఖీ చేసి, బ్రీత్‌ అనలైజర్‌ పరీక్షలో డ్రైవర్‌ లోకనాథ్‌రెడ్డి మద్యం సేవించినట్లు గుర్తించారు. దీంతో కాలేజీ యాజమాన్యం అతడిని డ్రైవర్‌ విధుల నుంచి తొలగించింది.