AKP: ఎలమంచిలి పట్టణం ధర్మవరం సచివాలయ పరిధిలో ‘ఫ్రైడే డ్రై డే’ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. మలేరియా నోడల్ అధికారి డాక్టర్ షేక్ అమీర్ షాజిద్ ప్రజలకు అవగాహన కల్పించారు. ఇళ్లలో నీటి నిల్వలను తొలగించి పాత్రలను శుభ్రం చేసి ఆరబెట్టాలని, ట్యాంకులు, డ్రమ్ములకు మూతలు పెట్టాలని సూచించారు. దోమల నిర్మూలనతోనే చాలా వ్యాధులను అరికట్టవచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్
'దోమల నియంత్రణకు డ్రైడే పాటించాలి'


