హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి: ఎస్సై

WG: రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని ఇరగవరం SI నసీరుల్లా సూచించారు. ఇరగవరం మండలం కె. ఇల్లిందలపర్రు హైస్కూల్లో శుక్రవారం విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడకూడదని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆయన స్పష్టం చేశారు.