హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

NTR: తొర్రగుడిపాడు 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో మెయింటెనెన్స్ పనుల కారణంగా రేపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు నందిగామ రూరల్ విద్యుత్ శాఖ ఏఈ తెలిపారు. తొర్రగుడిపాడు సబ్‌స్టేషన్ పరిధిలోని పల్లగిరి, సోమవరం, రుద్రవరం, రాఘవాపురం, కమ్మవారిపాలెం, గొల్లమూడి, మాగల్లు,కొండూరు, రామిరెడ్డిపల్లిలో విద్యుత్ సరఫరా నిలిచిపోనుందన్నారు.