NTR: కొండపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.96 కోట్ల నిధులు మంజూరయ్యాయి. మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. డ్రైనేజీలు, రోడ్లు, పార్కులు, సెంటర్ డివైడర్లు, లైటింగ్ పనులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఏడాది నుంచి రెండేళ్లలో పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటారు. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'కొండపల్లికి రూ.96 కోట్ల అభివృద్ధి నిధులు'


