హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాయితీపై రాజ్మా విత్తనాలు

ASR: అరకు డివిజన్ పరిధిలోని నాలుగు మండలాలకు 1,317 క్వింటాళ్ల రాజ్మా విత్తనాలు వచ్చాయని ఏడీఏ మోహన్‌రావు తెలిపారు. ఎకరాకు 20 కిలోల విత్తనాలతో పాటు కిలో ట్రైకోడెర్మా విరిడి అందిస్తామన్నారు. అరకులోయ మినహా మిగిలిన మండలాల్లో సోమవారం పంపిణీ ప్రారంభమవుతుందని తెలిపారు. రైతులు పట్టా పాస్‌బుక్, ఆధార్ జిరాక్స్‌లతో రైతు సేవా కేంద్రాలకు వెళ్లాలని సూచించారు.