హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం సహాయానిది చెక్కుల పంపిణీ

కోనసీమ: అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాజోలు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ గొల్లపల్లి అమూల్య అన్నారు. రాజోలు మండలం శివకోటిలో శుక్రవారం వివిధ గ్రామాలకు చెందిన 36 మంది లబ్ధిదారులకు నాయకుల చేతుల మీదుగా సీఎం సహాయానిది చెక్కులు అందజేశారు.