హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైద్య అధ్యాపకులకు బీసీఎంఈ శిక్షణ

విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాలలో మెడికల్‌ ఎడ్యుకేషన్‌ యూనిట్‌ ఆధ్వర్యంలో బేసిక్‌ కోర్స్‌ ఇన్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (బీసీఎంఈ)పై మూడు రోజుల శిక్షణ కొనసాగుతోంది. శుక్రవారం నిర్వహించిన శిక్షణలో వివిధ వైద్య కళాశాలలకు చెందిన 30 మంది అధ్యాపకులు ఆధునిక బోధనా పద్ధతులు, బోధన-అభ్యసన విధానాలు, మూల్యాంకనం, పాఠ్యప్రణాళిక అమలుపై శిక్షణ అందించారు.