AKP: రక్షాబంధన్ సందర్భంగా ఎస్ రాయవరం మండలం పెదగుమ్ములురు జడ్పీ హైస్కూల్ విద్యార్థులు చెట్లకు రాఖీలు కట్టి ‘వృక్ష రక్షాబంధన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. హెచ్ఎం సుధా మాధురి మాట్లాడుతూ.. చెట్లు ప్రాణవాయువు, నీరు, నీడ అందిస్తూ మన జీవితానికి ఆధారంగా నిలుస్తున్నాయని తెలిపారు. చెట్లను తోబుట్టువులుగా భావించి రక్షించుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
చెట్లకు రాఖీలు కట్టిన విద్యార్థులు


