హైదరాబాద్: 28°C
తెలంగాణ

మీడియా పేరుతో బెదిరింపులు ఇద్దరి అరెస్ట్

BDK: అశ్వారావుపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మీడియా పేరు చెప్పి రైతును బెదిరించి రూ. 5 వేల నగదు తీసుకున్న కేసులో ఇద్దరిని శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పండు కిరణ్‌, సయ్యద్‌ జాన్‌ అహ్మద్‌గా గుర్తించారు. వారి వద్ద రూ.1,000 నగదు, ప్రెస్‌ ఐడీ కార్డు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ నాగరాజు తెలిపారు.