హైదరాబాద్: 28°C
తెలంగాణ

బ్లాస్టింగ్‌తో పంటలు, బోర్లకు నష్టం: రంజిత్‌కుమార్

GDWL: గట్టు మండలం సల్కాపురం గ్రామంలోని జోఖన్‌గట్టు ప్రాంతంలో జరుగుతున్న బ్లాస్టింగ్‌ ప్రదేశాన్ని టీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి గొంగళ్ల రంజిత్‌కుమార్ రైతులతో కలిసి పరిశీలించారు. బ్లాస్టింగ్‌ కారణంగా బోర్లు దెబ్బతినడంతో పాటు పంటలకు నష్టం వాటిల్లుతోందని ఆయన తెలిపారు. అంతేకాకుండా ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడుతోందని పేర్కొన్నారు.