హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అత్యవసర సమయంలో ఫోన్ చేయాలి'

SKLM: ఆముదాలవలస మండలం జొన్నలవలస గ్రామం వద్ద శుక్రవారం శక్తి టీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్‌సీ లక్ష్మణరావు అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు వెంటనే 112కు కాల్ చేయాలని ప్రజలకు సూచించారు. సైబర్ నేరాలకు గురైనప్పుడు ఆలస్యం చేయకుండా 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని అవగాహన కల్పించారు. సైబర్ నేరాలు పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.