హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నీటి సరఫరా బంద్

NRPT: దామరగిద్ద మండలంలోని కానుకుర్తి, గడిమున్కన్పల్లి తదితర గ్రామాలకు నాలుగు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది. ఉడ్మల్‌గిద్ద పంప్‌హౌస్ వద్ద ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోవడంతో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం మరమ్మతు పనులు కొనసాగుతున్నాయని, పనులు పూర్తయిన వెంటనే నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని వెల్లడించారు.