హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధర్మారం నూతన ఎస్సైగా శ్రీకాంత్

PDPL: ధర్మారం పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్‌స్పెక్టర్‌గా ఎంబడి శ్రీకాంత్ శుక్రవారం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఎస్సైగా పని చేసిన ఎం.ప్రవీణ్ కుమార్ బదిలీ కాగా ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని, బాధితులు మధ్యవర్తులను ఆశ్రయించకుండా నేరుగా పోలీసులను సంప్రదించాలని సూచించారు.