JN: సముద్రాల బస్టాండ్లో కొన్నేళ్లుగా నిరాశ్రయుడిగా ఉంటున్న ఓ వ్యక్తికి రాఖీ పండుగ సందర్భంగా గ్రామానికి చెందిన కట్ల పద్మ రాఖీ కట్టి ఆప్యాయత చాటుకున్నారు. ఎవరూ లేని ఆ నిస్సహాయుడికి తోబుట్టువులా నిలిచి పండుగ జరుపుకొన్నారు. ఈ ఘటన పలువురిని భావోద్వేగానికి గురిచేసింది. తోటి మనిషిని ఆదరించాలనే సందేశం ఇచ్చారని స్థానికులు అభినందించారు
తెలంగాణ
నిస్సహాయుడి చేయికి రాఖీ బంధం


