హైదరాబాద్: 28°C
తెలంగాణ

కమిషనర్‌ను కలిసిన ఉద్యానవన అధికారి

WGL: గ్రేటర్ వరంగల్ నూతన ఉద్యానవన అధికారిగా తిరునగరి ప్రశాంత్ నియమితులయ్యారు. ఈ క్రమంలో గురువారం ఆయన బల్దియా కమిషనర్ టి.వెంకన్నను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు. నగరంలో పచ్చదనం, పార్కుల అభివృద్ధి, మొక్కల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని వారు సూచించారు. ప్రశాంత్ గతంలో పర్వతగిరి మండల వ్యవసాయాధికారిగా పనిచేశారు.