SDPT: బెజ్జంకి బస్టాండ్లో గురువారం సురక్ష తిరంగా కార్యక్రమంలో భాగంగా యువతకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఎస్సై తోట తిరుపతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930కు ఫోన్ చేయాలని సూచించారు. యువత గంజాయికి దూరంగా ఉండాలని, గంజాయి విక్రయాలు లేదా వినియోగంపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
తెలంగాణ
సైబర్ నేరాలపై అవగాహన


