హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉద్దవోలులో భజన కార్యక్రమాలు

PPM: ఉద్దవోలు గ్రామంలో టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భగవద్గీత పారాయణం, ఉపన్యాసం, భజన కార్యక్రమాలు నిర్వహించారు. విజయనగరం జిల్లా కన్వీనర్ జె. శ్యామ్‌సుందర్, మన్యం జిల్లా అధ్యక్షులు గులిపల్లి చినతిరుపతి ఆధ్వర్యంలో సత్యసాయి, షిర్డీసాయి భజన మండలి సభ్యులు పాల్గొన్నారు. భగవద్గీత సందేశాలను ప్రజలకు వివరించడంతో గ్రామంలో భక్తి వాతావరణం నెలకొంది.