హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హైవే భద్రతకు సూచిక బోర్డులు తప్పనిసరి

NTR: చిల్లకల్లులో హైవే రహదారి భద్రత, ట్రాఫిక్ నియమాలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. ఎస్‌ఐ సూర్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎంవీఐ, ట్రాఫిక్ ఆర్‌ఎస్‌ఐ, రైల్వే, ఎన్‌హెచ్‌ సిబ్బంది పాల్గొన్నారు. ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, వాహనదారులు వేగ నియంత్రణ పాటించాలని అధికారులు సూచించారు.