హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత్‌పై శ్రీలంక బ్యాటర్ అరుదైన రికార్డు

శ్రీలంక బ్యాటర్ సోనాల్ దినుషా భారత్‌పై అరుదైన ఘనత సాధించాడు. తన తొలి నాలుగు టెస్టు ఇన్నింగ్స్‌ల్లో 80కిపైగా పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. అంతకుముందు 1948లో వెస్టిండీస్ దిగ్గజం ఎవర్టన్ వీక్స్ 128, 194, 162, 101 పరుగులతో ఈ ఘనత సాధించాడు. దినూషా నిలకడైన బ్యాటింగ్‌తో రికార్డు సృష్టించాడు.