హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆర్టీసీ సర్వీసులపై ప్రయాణికుల ఆగ్రహం

అన్నమయ్య: రాజంపేట పాత బస్టాండ్‌లో బస్సుల కోసం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్స్‌ప్రెస్‌, పల్లెవెలుగు సర్వీసులు సమయానికి రాకపోవడంతో గంటకుపైగా బస్టాండ్‌లోనే వేచి ఉండాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. ఆర్టీసీ అధికారులు స్పందించి బస్సు సర్వీసులను సక్రమంగా నడిపించాలని కోరుతున్నారు.