హైదరాబాద్: 28°C
తెలంగాణ

యూరియా దొరక్క రోడ్డెక్కిన కోనాపూర్ రైతులు

మెదక్ జిల్లా కోనాపూర్‌లో యూరియా సకాలంలో అందక, ఆన్‌లైన్ సర్వర్ పనిచేయక విసిగిపోయిన రైతులు రహదారిపైకి ఎక్కారు. మెదక్-వెల్కటూర్ (765D) ప్రధాన రహదారిపై అర్ధగంట పాటు బైఠాయించి నిరసన తెలిపారు. రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో రామాయంపేట పోలీసులు రంగంలోకి దిగారు. యూరియా సరఫరా అయ్యేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు తమ ఆందోళనను విరమించారు.