RR: ఇబ్రహీంపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురునానక్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు సాయంత్రం సమయంలో జేబీ వెంచర్ వైపు నడుస్తుండగా.. మాల్ వైపు నుంచి వస్తున్న ట్రాలీ ఆటో ఒక్కసారిగా ఢీకొట్టడంతో విద్యార్థులు ఒక్కసారిగా ఎగిరిపడ్డారు. ఓ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో 108లో స్థానిక ఆస్పత్రికి తరలించారు.
తెలంగాణ
ఘోర రోడ్డు ప్రమాదం.. విద్యార్థి మృతి


