హైదరాబాద్: 28°C
క్రీడలు

ఐదో స్థానం కోసం జర్మనీతో భారత్ పోరు

మహిళల హాకీ ప్రపంచకప్‌లో నేడు భారత జట్టు జర్మనీతో తలపడనుంది. 'పూల్ D' లో ఉన్న టీమిండియా.. ఒక మ్యాచ్‌లో గెలిచి, మరో రెండు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుని సెమీస్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. దీంతో జర్మనీతో జరిగే పోరులో 5వ స్థానం కోసం పోటీపడనుంది. ఈ మ్యాచ్ సా.6:30 గంటలకు ప్రారంభం కానుంది. దీనిని జియోహాట్‌స్టార్‌లో లైవ్ చూడవచ్చు.