హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రవక్త బోధనలు ఆచరణీయం: ఎమ్మెల్యే

ATP: మానవాళి శ్రేయస్సుకు కృషి చేసిన కారణజన్ముడు మహమ్మద్ ప్రవక్త అని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా పాతూరు బంగారువీధిలోని దర్గాలు, ఆసార్ దర్గాలో ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలుపుతూ శాంతి, సోదరభావం, మానవత్వం పెంచేలా ప్రవక్త చూపించిన మార్గంలో నడవాలని సూచించారు.