హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మత్స్య రంగంలో భారత్ ప్రపంచానికి ఆదర్శం'

NLG: భారత మత్స్య, ఆక్వాకల్చర్ రంగం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని బీజేపీ నేత ఎల్.వి. రమణ ముదిరాజ్ తెలిపారు. నల్గొండలో మాట్లాడుతూ కేంద్రం అమలు చేస్తున్న బ్లూ రెవల్యూషన్, పీఎంఎంఎస్‌వై పథకాలు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చాయని అన్నారు. సీషెల్స్ మత్స్య శాఖ మంత్రి హైదరాబాద్‌లోని ఎన్‌ఎఫ్‌డీబీని సందర్శించడమే ఇందుకు నిదర్శనమన్నారు.