హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇంద్రనగర్‌లో రక్తదాన శిబిరం

VKB: మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఇంద్రనగర్ యూత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మున్సిపల్ ఛైర్‌పర్సన్ నీరజ బాల్ రెడ్డి హాజరై 20 మంది రక్తదాతలకు సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం కంజర్ల ఫౌండేషన్ అధినేత కంజర్ల విజయలక్ష్మి రక్తదాతలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.