ప్రకాశం: అద్దంకి మండలంలో విద్యుత్తు పనుల్లో భాగంగా బుధవారం పట్టణంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని డీఈఈ దామోదరం తెలిపారు. రామ్నగర్ మెయిన్రోడ్డు, జంక్షన్, కొత్త పసుపూర్తిపాలెం, గ్యాస్ గోదాం తదితర ప్రాంతాల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు సరఫరా నిలుపుదల చేస్తామని ప్రజలు సహకరించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం


