హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టాస్క్‌ఫోర్స్ అధికారుల తనిఖీలు

అన్నమయ్య: పీలేరు మండలంలోని తలుపుల పీహెచ్‌సీ పరిధిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ టాస్క్‌ఫోర్స్ అధికారులు క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు. కావలిపల్లె సచివాలయంలో ఆరోగ్య సేవలు, గర్భిణుల సేవలు, కౌమార బాలికల హెచ్‌బీ పరీక్షలు, ఆర్‌సీహెచ్,హెచ్‌ఎంఐఆర్ రికార్డులు, ఆన్‌లైన్ వివరాలను పరిశీలించారు. రికార్డులు, నివేదికల నిర్వహణపై సిబ్బందికి పలు సూచనలు చేశారు.