హైదరాబాద్: 28°C
తెలంగాణ

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం కారేపల్లిలో పాదయాత్ర

KMM: కారేపల్లిలో మంగళవారం టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధన కోసం పాదయాత్ర నిర్వహించారు. కారేపల్లి ప్రెస్‌క్లబ్‌తో పాటు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు సంఘీభావం ప్రకటించాయి. పాదయాత్ర తహసీల్దార్ కార్యాలయం వరకు సాగగా, అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఇళ్ల స్థలాలు సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని టీడబ్ల్యూజేఎఫ్ నాయకులు తెలిపారు.