హైదరాబాద్: 28°C
క్రైమ్

అక్రమ పాన్‌మసాలా తయారీ గుట్టు రట్టు 

TG: మేడ్చల్‌లో అక్రమ పాన్‌మసాలా తయారీ యూనిట్ గుట్టు రట్టు అయింది. రూ.76 లక్షల విలువైన 5,500 కిలోల స్టాక్‌ను జీఎస్టీ అధికారులు సీజ్ చేశారు. రూ.160 కోట్ల పన్ను ఎగవేత‌ను గుర్తించారు. 56 మందితో అక్రమంగా పాన్‌మసాలా తయారు చేస్తున్నట్లు తెలిపారు. యూనిట్ నిర్వాహకుడిని అరెస్ట్ చేసి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.