హైదరాబాద్: 28°C
క్రీడలు

శ్రీలంక ప్లేయర్‌పై ఐసీసీ చర్యలు

భారత్‌తో జరుగుతున్న టెస్టులో ICC నియమావళిని ఉల్లంఘించిన శ్రీలంక క్రికెటర్‌ ప్రభాత్‌ జయసూర్యను ICC మందలించి, ఒక డీమెరిట్‌ పాయింట్‌ ఇచ్చింది. ఆటలో ఔటయ్యాక పెవిలియన్‌కు వెళ్తూ అసహనంతో బ్యాట్‌తో బౌండరీ రోప్‌ను కొట్టడంతో ఇది లెవల్‌ 1 ఉల్లంఘనగా తేలింది. ప్రభాత్‌ తన తప్పును అంగీకరించడంతో తదుపరి విచారణ అవసరం లేదని ఐసీసీ తెలిపింది.