హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైన్స్ తనిఖీల్లో ఎక్సైజ్ అధికారులు

పల్నాడు జిల్లా రొంపిచర్లలోని నీలకంఠేశ్వర,త్రికోటేశ్వర వైన్స్‌లను ఈపూరు ఎక్సైజ్‌ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు.మద్యం ధరలు, నిల్వలను పరిశీలించి ‘ఎక్సైజ్‌ సురక్ష యాప్‌’ ద్వారా విక్రయాలు , ఎంఆర్‌పీ ధరల పట్టిక ప్రదర్శించాలని సూచించారు. నాటుసారా, గంజాయి, కల్తీ కల్లు సమాచారాన్ని అధికారులకు తెలియజేయాలని ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ డి.వెంకటేశ్వర్లు కోరారు.