హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా వాసికి డాక్టరేట్ ప్రదానం

PPM: పేద ప్రజలకు అందిస్తున్న సేవలను గుర్తించి దూబ రాంబాబుకు డాక్టరేట్ అవార్డు ప్రదానం చేశారు. విశాఖపట్నంలోని పబ్లిక్ లైబ్రరీ హాల్‌లో మంగళవారం అమెరికాకు చెందిన డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఛాన్సలర్ అమోస్ చేతుల మీదుగా డాక్టరేట్‌ను అందజేసి, శాలువాతో సత్కరించారు. మన్యం జిల్లాల్లో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా సంక్షేమ పథకం మేనేజర్‌గా సేవలందిస్తున్నారు.