హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జగన్‌ను కలిసిన కేతిరెడ్డి

సత్యసాయి: తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మాజీ సీఎం, పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కేతిరెడ్డి కలిశారు. పార్టీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. తాజా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్‌ కార్యాచరణపై ఇరువురు మాట్లాడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా కేతిరెడ్డి జగన్‌తో కొద్దిసేపు సమావేశమయ్యారు.