SKLM: మాజీ సీఎం జగన్ను తాడేపల్లిలో ఆమదాలవలస ఇంఛార్జ్ చింతాడ రవికుమార్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఆముదాలవలస నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఇరువురు చర్చించారు. రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు, ఒత్తిళ్లు ఎదురైనా ధైర్యంగా ఉండాలని జగన్ సూచించారు. అలాగే, పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుందని ఆయనకు హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
మాజీ సీఎం జగన్ను కలిసిన చింతాడ


