ADB: మావల మండలంలోని వాఘాపూర్ గ్రామంలో సర్వే నంబర్ 37లో పట్టా ఉండి భూమి లేని ఆదివాసుల ఏళ్ల నాటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డిని మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం చూపుతామని శ్రీనివాసరెడ్డి వారికి హామీ ఇచ్చారు. నాయకులు భూపల్లి శ్రీధర్, గౌతమ్ తదితరులున్నారు.
తెలంగాణ
'ఆదివాసుల భూసమస్యను పరిష్కరించాలి'


