హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులపై అదనపు భారం వద్దు: PDSU

HNK: హన్మకొండ నగరంలో కాకతీయ యూనివర్సిటీ ఎన్డీఎల్సీఈలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ పీడీఎస్‌యూ జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కౌన్సెలింగ్‌లో ఎంపికైన విద్యార్థులు ఇప్పటికే ఆన్‌లైన్‌లో రూ.13 వేల ఫీజు చెల్లించినప్పటికీ, అదనంగా మరో రూ.7 వేలు చెల్లించాలని అధికారులు కోరడాన్ని జిల్లా అధ్యక్షుడు బి. వంశీకృష్ణ ఖండించారు.