హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని వినతి'

KMR: ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జిల్లా ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ జేఏసీ అధ్యక్షుడు నర్సింలు డిమాండ్ చేశారు. సోమవారం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆటోల బంద్ నిర్వహించారు. అనంతరం కామారెడ్డి కలెక్టరేట్లో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఆటో డ్రైవర్ల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిష్కారం చూపాలని నర్సింలు కోరారు.