హైదరాబాద్: 28°C
తెలంగాణ

శిథిల భవనాల్లో ఉండవద్దు: MRO

MDK: ​రామాయంపేట మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న పాత ఇళ్లు, బలహీనమైన భవనాలు, గుడిసెలలో ప్రజలు ఎవరూ నివాసం ఉండవద్దని తహసీల్దార్ రజనీకుమారి సూచించారు. ప్రమాదకరమైన నిర్మాణాల్లో నివసించే వారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు లేదా సహాయ శిబిరాలకు తరలివెళ్లాలని, అప్రమత్తంగా ఉండాలని కోరారు.