హైదరాబాద్: 28°C
తెలంగాణ

కూలుతున్న డ్రైనేజీ గోడ.. పొంచి ఉన్న ప్రమాదం

PDPL: గోదావరిఖని కాకతీయనగర్‌లో తాజుద్దీన్ బాబా దర్గా సమీపంలోని ప్రధాన మురికి కాలువ సైడ్‌వాల్ కూలిపోతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పక్కనే ఉన్న గణపతి మండపం, నివాస ప్రాంతాలకు ప్రమాదం పొంచి ఉంది. డ్రైనేజీలో చెత్త పేరుకుపోవడంతో వర్షాకాలంలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు.