హైదరాబాద్లో సీజనల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పరిశుభ్రత పాటిస్తూ, అనారోగ్యంతో ఉన్నవారికి దూరంగా ఉండాలి. జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ఒంటినొప్పులు ఉంటే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని ఆశ్రయించాలి. అత్యవసర పరిస్థితుల్లో 108కు కాల్ చేయాలని తెలిపారు.
తెలంగాణ
వైరల్ జ్వరాలపై అప్రమత్తత


