KMR: జిల్లాకు చెందిన శాస్త్రవేత్త డా. పైడి ఎల్లారెడ్డి జపాన్ పర్యటనకు ఎంపికయ్యారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలోని 'ఇండియన్ బిజినెస్ డెలిగేషన్' బృందంలో ఆయనకు చోటు దక్కింది. నేటి నుంచి ఈనెల 28 వరకు జరిగే పర్యటనలో జపాన్ పారిశ్రామికవేత్తలతో సమావేశాల్లో పాల్గొననున్నారు. ఆయన పర్యటన జిల్లాకు గర్వకారణమని పలువురు పేర్కొన్నారు.
తెలంగాణ
సీఐఐ ఆహ్వానంతో జపాన్కు జిల్లా వాసి


