హైదరాబాద్: 28°C
క్రీడలు

సెంచరీలు బాదిన సుదీప్, షాబాజ్

దులీప్ ట్రోఫీలో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు మొదలయ్యాయి. నార్త్ ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ బ్యాటర్లు సుదీప్ కుమార్(146), షాబాజ్ అహ్మద్ (100*) సెంచరీలు చేశారు. కుమార్ కుశాగ్ర (55) రాణించాడు. తొలి రోజు ఆట ముగిసేసమయానికి ఈస్ట్ జోన్ 6 వికెట్ల నష్టానికి 355 పరుగులు చేసింది. షాబాజ్ అహ్మద్‌తోపాటు అనుకుల్ (22) నాటౌట్‌గా క్రీజులో ఉన్నాడు.