హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏకగ్రీవంగా కాలనీ కొత్త బాడీ ఎన్నిక

MDCL: మేడిపల్లి డివిజన్ విహారిక కాలనీ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాలనీ అధ్యక్షుడిగా ఏ.వీ. రమణా రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కే. మనోజ్ ప్రదీప్, కోశాధికారిగా గుండా యాదగిరి గౌడ్‌లు ఎన్నికయ్యారు. కాలనీ అభివృద్ధికి తమ శాయశక్తులా కృషి చేస్తామని గెలుపొందిన అభ్యర్థులు పేర్కొన్నారు.