పార్వతీపురం మన్యం జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోమవారం PGRS కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదివారం అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రతి కార్యాలయంలో ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకరించాలన్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్లో ప్రతిరోజూ వినతులు స్వీకరిస్తామన్నారు. అర్జీదారులు మీకోసం వెబ్సైట్లో దరఖాస్తు చేయవచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు పీజీఆర్ఎస్ కార్యక్రమం


