హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేకాట స్థావరంపై దాడి.. ఐదుగురు అరెస్ట్

KMR: ఎల్లారెడ్డి మండలంలోని బ్రహ్మన్‌పల్లి గ్రామ ప్రకృతి వనంలో జూదం ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు శనివారం సాయంత్రం అరెస్టు చేశారు. సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 2,640 నగదు, 3 మొబైల్‌ఫోన్లు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.