హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైస్‌ మిల్లు సందర్శించిన విద్యార్థులు

KMR: కామారెడ్డి కేంద్రంలోని రైస్‌ మిల్లును కాటేపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు శనివారం సందర్శించారు. ధాన్యం సేకరణ నుంచి బియ్యం తయారీ వరకు జరిగే ప్రక్రియను పరిశీలించారు. ధాన్యం దిగుమతి, బియ్యం, తౌడు, పొట్టు వేరు చేసే విధానాన్ని మిల్‌ నిర్వాహకులు విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో రైస్‌మిల్‌ యజమాని, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.