హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెద్ది కుటుంబాన్ని పరామర్శించిన పుట్ట మధూకర్

WGL: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పరామర్శించారు. శనివారం నల్లబెల్లిలోని పెద్ది నివాసానికి వెళ్లిన ఆయన, పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ రఘువీర్‌సింగ్‌తో కలిసి పెద్ది చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.