హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

NDL: శిరివెళ్ల మండలంలోని అన్ని గ్రామాల్లో శనివారం విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఉంటుందని విద్యుత్‌ శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. సబ్‌స్టేషన్‌లో మెయింటెనెన్స్‌ పనుల కారణంగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోతుందన్నారు. వ్యవసాయానికి త్రీఫేస్‌ విద్యుత్‌ ఉదయం 6 నుంచి 9 గంటల వరకు సరఫరా చేస్తామని పేర్కొన్నారు.